Saturday 25 August 2012

పరిచయం



నా పేరు డా||అల్లూరి వేంకట నరసింహ రాజు. నా వయస్సు 75 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్టణమైన ఏలూరులో నివాసముంటున్నాను.

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంధ్ర భాషా సాహిత్యాలలో ఎం.ఏ. డిగ్రీ, ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ నుండి తులనాత్మక విద్యా బోధనలో ఎం.ఎడ్. డిగ్రీ పుచ్చుకొని రెండు దశాబ్దాలపాటు ప్రభుత్వ ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యునిగా పనిచేసి 1995 వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశాను.

"కవికోకిల" దువ్వూరి రామిరెడ్డి రచనలపై పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీ సంపాదించిన నేను సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో సుమారు 30 గ్రంధాలు వ్రాసి ప్రచురించాను. నా "వ్యక్తిత్వము-సాహిత్యము" పై డా||యం.వి.యస్.సత్యనారాయణ గారు నాగార్జున యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు.

విశ్రాంతి జీవితం గడుపుతున్న నేను రసజ్ఙ పాఠకుల కోసం కొన్ని విషయాలను బ్లాగ్ లో పెట్ట సంకల్పించాను. పాఠకులు చదివి తమ తమ అభిప్రాయాలను పంపితే చూచి ఆనందిస్తా...



No comments:

Post a Comment